Oct 26,2023 19:43

ఎంపిడిఒకు వినతిపత్రం అందజేస్తున్న సర్పంచి

ప్రజాశక్తి - చిప్పగిరి
వచ్చే వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే తక్షణమే కాజీపురం జలాశయానికి తాగునీటిని నింపాలని చిప్పగిరి సర్పంచి గోవిందరాజులు ఆధ్వర్యంలో సర్పంచులు అధికారులను కోరారు. గురువారం కాజీపురం రిజర్వాయర్‌ దగ్గర ఎంపిడిఒ సివి.కొండయ్యకు సర్పంచి గోవిందరాజులు, ఇతర గ్రామాల సర్పంచులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడారు. కాజీపురం జలాశయంలో రోజురోజుకూ తాగునీరు తగ్గడంతో చిప్పగిరిలో పది రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే వేసవిలో తాగునీటి సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా జలాశయానికి తాగునీరు నింపాలని కోరారు. కాజీపురం సర్పంచి రమాదేవి భర్త రమేష్‌, హేమాంజనేయులు, గుమ్మనూరు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.