
విసి ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ కృష్ణమోహన్ నుంచి ఉత్తర్వులు స్వీకరిస్తున్న వినరుకుమార్
ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ : ఆంధ్రవిశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతిగా డాక్టర్ సిఎం.వినరుకుమార్ నియమితులయ్యారు. ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ సోమవారం వినరుకుమార్కు ఉత్తర్వులు అందించారు. అనంతరం ఆయన విభాగంలో బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా వినరుకుమార్ను విభాగ ఆచార్యులు డివిఆర్ మూర్తి, సిహెచ్.రామకృష్ణ, టి.విజయలక్ష్మి అభినందించారు.