Aug 02,2021 08:35

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో డ్రోన్లు మరోసారి కలకలం సృష్టించాయి. ఈసారి నాలుగు అనుమానిత డ్రోన్లు సాంబా జిల్లాలోని బరి బ్రాహ్మణ ప్రాంతంలో చక్కర్లు కొట్టాయి. వీటిలో ఒకటి ఆర్మీ క్యాంప్‌ దగ్గర ఆదివారం రాత్రి 8.30 సమయంలో కనిపించింది. బరి బ్రాహ్మణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ సిబ్బంది ఈ డ్రోన్లను గుర్తించారు. అయితే పరిధికి మించి ఎత్తు ఎగురుతున్నందున అధికారులు కాల్పులు జరపలేదు. గత నెలలో ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు దాడికి పాల్పడిన సంగతి విదితమే.