
ప్రజాశక్తి-పాడేరు: ఎస్ఎస్ఆర్ -2024 డ్రాప్ట్ పబ్లికేషన్ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విడుదల చేసారు. ఈనెల 27వ తేదీ నాటికి జిల్లాలో 7 లక్షల 40 వేల 573 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసామని చెప్పారు. ఈ మేరకు డ్రాప్టు ప్రతులు ఉన్న సిడీలను రాజకీయ పార్టీల నేతలకు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 28 అరకువ్యాలీ నియోజక వర్గంలో పురుషులు ఓటర్లు 113087, మహిళా ఓటర్లు 119243 మంది, ధర్డ్ జెండర్లు 7గురు మొత్తం 2 లక్షల 32 వేల 337 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.. 29 పాడేరు అసెంబ్లీ నియోజక వర్గంలో పురుషు ఓటర్లు 114146 మంది, మహిళా ఓటర్లు 122071 మంది, ధర్డ్ జెండర్లు 15 మంది ఓటర్లు మొత్తం 236232 మంది ఓటర్లు ఉన్నారని స్పష్టం చేసారు. 53 రంపచోడవరం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో పురుష ఓటర్లు 129696 మంది, మహిళా ఓటర్లు 142297 మంది, ధర్డ్ జెండర్లు 11 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటరు నమోదు, తొలగింపులపై నవంబరు 4, 5 తేదీలలోను, డిసెంబరు 2,3 తేదీలలో నాలుగు రోజులు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబరు 9వ తేదీలోపు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన ఫైనల్ ఓటరు జాబితా ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి, కలెక్టరేట్ పరిపాలనాధికారి చిన్ని క్రిష్ణ, వివిద రాజకీయ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.