ప్రజాశక్తి - కైకలూరు
జగనన్న కాలనీకి విద్యుత్ సమస్యలు తీరాయని ఎంఎల్ఎ దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జగనన్న గ్రీన్ విలేజ్లో నూతన సబ్ స్టేషన్, రూరల్ ఎఇ కార్యాలయాలను ఎంఎల్ఎ దూలం నాగేశ్వరరావు, ఎంఎల్సి జయమంగళ వెంకటరమణలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కురేళ్ల బేబి, ఎంపిపి అడవి వెంకట కృష్ణమోహన్, సర్పంచి దానం మేరీ నవరత్న కుమారి పాల్గొన్నారు.










