సమీక్షలో పాల్గొన్న సీనియర్ జడ్జి జయలక్ష్మి, ఇతర అధికారులు
ప్రజాశక్తి కదిరి అర్బన్ : జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9 న జాతీయ లోక్ అదాలత్ నిర్వస్తున్నట్టు చైర్మన్ మండల న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్మన్, సీనియర్ జడ్జి జయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పట్టణ న్యాయస్థాన ఆవరణంలో న్యాయవాదులు,పోలీసులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.. సెప్టెంబర్ 9న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను దిగ్విజయం చేయాలన్నారు.










