
మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు
ప్రజాశక్తి -మధురవాడ : ఇష్టపడి కష్టపడితే ఏదీ నష్టపోరని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పిఎం.పాలెం క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న గ్రీన్డాల్ స్కూల్ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పాఠశాల నుంచే మాతృభాషపై మంచి పట్టు సాధించాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఎడ్యుకేషన్ వేరియంట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విద్యార్థులకు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. మన సంస్కృతి గురించి విద్యార్థులకు చెప్పాలని సూచించారు. పాఠశాల వ్యవస్థాపకులు రాజేంద్ర, రవీంద్ర విద్యనందించడంలో నిష్ణాతులని పేర్కొన్నారు.