
ప్రజాశక్తి - నూజివీడు రూరల్
మండలంలోని మెట్టగూడెం గ్రామానికి చెందిన జుజ్జూరు రవికిరణ్(17) ఈనెల 21వ తేదీ నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రవికిరణ్ ఏలూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.