Aug 01,2021 17:19

యలమంచిలి : పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలం చించివాడ వంతెన వద్ద గోదావరిలో దూకి ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురుకు చెందిన భార్యాభర్తలు సతీశ్‌, సంధ్య, వారి పిల్లలు జశ్విన్‌(4), బిందుశ్రీ (2)గా పోలీసులు గుర్తించారు. దీంతో జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.