Jan 13,2023 00:18

అనిల్‌ నీరుకొండ ఇంజినీరింగ్‌ కళాశాలలో నివాళి

ప్రజాశక్తి-విశాఖపట్నం
స్వామి వివేకానంద జయంతినిగురువారం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఘనంగా నిర్వహించారు.
లీగల్‌ : ఫ్రెండ్స్‌ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ డాబాగార్డెన్స్‌లోని అసోసియేషన్‌ ఆఫీసులో వివేకానంద జయంతిని నిర్వహించారు. వివేకానంద రచనలు, ఆయన జీవితంపై వివిధ వ్యాసరచన పోటీలు, డిబేట్‌ పెట్టి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయుటకు నిశ్చయించుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు విద్యాశంకర్‌, ఖండేల్వాల, పి.గోవిందరావు, బగాధి తులసీదాసు, హరిహర రెడ్డి, విజరుకుమార్‌, సమర్పణరావు, కిల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
తగరపువలస : స్వామి వివేకానంద జయంతి ని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవ వేడుకలు సంగివలస అనిల్‌ నీరుకొండ ఇంజినీరింగ్‌ కళాశాలలో గురువారం నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా ఎయు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.కృష్ణమోహన్‌ హాజరై మాట్లాడారు. జీవితంలో విజయాలు సాధించేందుకు సరైన మార్గాలు ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.రామకృష్ణ, సివిల్‌ విభాగాధిపతి డాక్టర్‌ నరసింగరావు పాల్గొన్నారు.
భీమిలిలో జివిఎంసి, పిఎన్‌ఎం ఉన్నత పాఠశాలలో జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ హిందీ ప్రేమీ మండలి అధ్యక్షులు కెఎస్‌ఆర్‌.కృష్ణారావు, గౌరవాధ్యక్షులు గంటా నూకరాజు, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, రాజేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆనందపురం : ఆనందపురం మండలంలో ఒఎస్‌జి ఫౌండేషన్‌ శివ దళాయి, విబీ హ్యుమానిటీ ఫౌండేషన్‌ వెంకట్‌, అల్లూరి సీతారామరాజు ఫౌండేషన్‌ అరవింద్‌ చక్రి లోకేష్‌, జై జవాన్‌ ఫౌండేషన్‌ రాజశేఖర్‌ రామలక్ష్మి ముడసల శ్రీను లోకేష్‌ ఆధ్వర్యాన జయంతి వేడుకలు నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు
గుడిలోవలోవ విజ్ఞాన విహార్‌, శ్రీ సరస్వతి విద్యా విహార్‌ ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి బాలి రవి, ప్రధానోపాధ్యాయులు హెచ్‌బివి.శ్రీనివాసరావు, ఎన్‌.సాయి బ్రహ్మాజీ , ఉపాధ్యాయ బందం పాల్గొన్నారు.
ఆనందపురం గ్రామంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు, సోషల్‌ మీడియా కన్వీనర్‌ పివివి.ప్రసాదరావు పట్నాయక్‌, ఉప్పాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ములగాడ : స్థానిక సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యాన జాతీయ యువజన దినోత్సవ సమావేశం నిర్వహించారు. వివేకానందునిపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్‌ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థిని, బెస్ట్‌ వాలంటీర్‌గా ప్రశంసలందుకున్న బి.పద్మజ వివేకానందుని జీవిత చరిత్ర, ఆయన బోధనలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపిఎస్‌.భాగ్యలక్ష్మి, సీనియర్‌ ప్రోగ్రామ్‌ అధికారి వై.అనసూయా దేవి, అంజలి దేవి, ఎ.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం : ఏయూ పరిపాలనా భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో వివేకానంద చిత్రపటానికి వీసీ ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ు
గీతంలో : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గీతం విశ్వవిద్యాలయంలో జాతీయ యువజన దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఆవరణలోని సదర్మసదన్‌లో గల వివేకానందుని విగ్రహం వద్ద రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌, స్టూడెంట్‌ లైఫ్‌ సహయ డైరక్టర్‌ డాక్టర్‌ సూరిబాబునాయక్‌ తదితరులు విద్యార్ధులతో కలసి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.