
ప్రజాశక్తి - ఆరిలోవ : ప్రజా కళాకారుడు, వీధినాటక ప్రయోగ కర్త, వీధి నాటకాన్ని పోరాట ఆయుధంగా మలిచిన మానవతావాది సప్ధర్ హష్మి 34వ వర్థంతిని ప్రజానాట్యమండలి ఆరిలోవ కమిటీ ఆధ్వర్యాన సోమవారం రవీంద్రనగర్ బస్టాపు వద్ద ఘనంగా నిర్వహించారు. ప్రజా నాట్యమండలి జోన్ అధ్యక్ష, కార్యదర్శులు వై.అప్పారావు, లకీëనారాయణ, సభ్యులు చంటి, సూర్యనారాయణ, రమణ, సన్యాసమ్మ, నాగరాజు తదితరులు హష్మీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వి.నరేంద్రకుమార్, వి.కృష్ణమూర్తి మాట్లాడుతూ, కార్మిక వర్గం హక్కుల కోసం జరిగిన అనేక పోరాటాల్లో ప్రజా నాట్యమండలి కళాకారులు కళారూపాలు ప్రదర్శిస్తూ ప్రజా చైతన్యానికి బాసటగా నిలిచారన్నారు. కళాకారుడు హష్మీ బాటలోనే ప్రజానాట్యమండలి కళాకారులు నడవాలని పిలుపునిచ్చారు.