
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మంగళవారం రెడ్ బుక్ డేను ఘనంగా నిర్వహించారు. మహాకవి శ్రీశ్రీ మహా ప్రస్థానం కవితలను ఉత్సాహంగా పఠించారు.
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : సిపిఎం మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజవర్గం పూర్వ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు, వామపక్షవాదులు, అభ్యుదయవాదులు, కవులు, కళాకారులు, సాహితీ ప్రియులు రెడ్ బుక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1848లో కార్ల్ మార్క్స్, ఫెడరిక్ ఎంగెల్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టోని ఫిబ్రవరి 21న ఆవిష్కరించారన్నారు. రెడ్ బుక్ డే ప్రాముఖ్యతను వివరించారు. అలాగే శ్రీశ్రీ మహాప్రస్థానంలోని గేయాలు, కవితల్లో ఉన్న సారాంశాన్ని తెలియజేశారు. సమస్యలన్నిటికీ పరిష్కార సూచికలుగా శ్రీశ్రీ కవితలు ఉంటాయన్నారు. వాటిని అర్థం చేసుకొని సమాజ మార్పునకు కృషి చేయాలన్నారు. పార్టీ జోన్ కార్యదర్శి వి.కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శాస్త్రి, జివిఎన్.చలపతి, జిఎస్.రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఉక్కునగరం : స్థానిక సిఐటియు కార్యాలయంలో మహాప్రస్థానం రచనలపై చర్చించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువతను చైతన్యపరిచే పద సంపద శ్రీశ్రీ కవితల్లో ఉందన్నారు. ఆయన కవితలను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది రచయితలుగా ఎదిగారని తెలిపారు. కళా రంగంలో యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్, ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
ములగాడ : జివిఎంసి 63వ వార్డు పరిధి క్రాంతినగర్లో మహాప్రస్థానం కవితలు పఠనం చేశారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మహాప్రస్థానంలోని పలు కవితలను ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేటి దోపిడీ సమాజాన్ని మార్చాలంటే మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అన్వయించుకొని శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 59వ వార్డు పరిధి నెహ్రూనగర్, 62వ వార్డు పరిధి దుర్గానగర్, 63వ వార్డు పరిధి చింతల్లోవలోనూ రెడ్బుక్ డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మల్కాపురం జోన్ కార్యదర్శి పి.పైడిరాజు, నాయకులు ఆర్.లక్ష్మణమూర్తి, కె.పెంటారావు, పివి.భాస్కరరావు, ఎల్.కృష్ణ, పి.రామారావు, ఎన్.శ్రీనివాసరావు, పి.సురేష్, వై.గంగాధర్, నీలయ్య హరి, బి.శ్రీను, వెంకటేష్, రాజు, గణేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
మధురవాడ : కొమ్మాది కూడలిలోని సిఐటియు కార్యాలయంలో శ్రీ శ్రీ కవితలు ఆలపించారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, సిపిఎం జోన్ కార్యదర్శి డి.అప్పలరాజు, డి కొండమ్మ, బి.భారతి, డి.శైలజ, విజరు, ఎస్.రామప్పడు, కె.సుజాత పాల్గొన్నారు.
కంచరపాలెం : కంచరపాలెంలోని బిఎన్ఆర్ భవన్లో శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానంలోని కవితలను చదివి వినిపించారు. మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని సాహితీ స్రవంతి కన్వీనర్ పెంటకోట రామారావు ప్రారంభించారు. సాహితీ స్రవంతి జిల్లా కమిటీ సభ్యులు పలమరశెట్టి ఫ్రాన్సిస్, బొడ్డు కూర్మారావు, కె.స్వతంత్రకుమార్ కవితా విశ్లేషణ చేశారు. సుమారు 20 మంది కవులు, ప్రజా నాట్యమండలి గాయకుడు పందిరి రాము పాల్గొన్నారు.
తగరపువలస : స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ఆర్ఎస్ఎన్ మూర్తి, రవ్వ నరసింగరావు, కె.నాగరాణి, భాగం లక్ష్మి, అన్నాబత్తుల నరసింగరావు, కె.రాము, సోమి వెంకట్, బాబాజీ పాల్గొన్నారు.
గాజువాక : గాజువాక పరిధి దశమకొండ, భానోజీ తోట, జోగావానిపాలెం, స్వతంత్ర నగర్లో రెడ్ బుక్ డే నిర్వహించారు. మహాప్రస్థానం కవితలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమాల్లో ఎం.శ్రీదేవి, సంతోషం, వరలక్ష్మి, మంగ, యుటిఎఫ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనిత, ఎం.రాంబాబు, ఎ.లోకేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజాశక్తి విశాఖ ఎడిషన్ కార్యాలయంలో జరిగిన రెడ్ బుక్ డే కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ ఎం.వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
కె.కోటపాడు : స్థానిక సిఐటియు కార్యాలయంలో మంగళవారం రెడ్ బుక్ డే సందర్భంగా చదువుదాం సమాజాన్ని మారుద్దాం అనే కార్యక్రమాన్ని ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితలు పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల మండల కన్వీనర్ ఎర్ర దేవుడు, వనం సూర్యనారాయణ, అభిమానులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : సమాజం మార్పుకు కష్టజీవులు శ్రమజీవులు కలిసి రావాలని జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకట అప్పారావు పిలుపునిచ్చారు. రెడ్ బుక్ డే సందర్భంగా హరిపాలెంలో మహాప్రస్థానం పుస్తక పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు ఆర్ రాము, కె.సోమనాయుడు, ఎం రామ్ కుమార్, కర్రి అప్పారావు, కాండ్రేగుల రామ సదాశివరావు, శరగడం కనుము నాయుడు, బుద్ధ రంగారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.