ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాతృభాషా దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు రఘునాథ్, తెలుగు ఉపాధ్యాయులు కావేరి రంగనాయకులు, పూల రామాంజనేయులు, కె.ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం తెలుగు భాషను ఉన్నత శిఖరాలకు చేర్చిన గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి, హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా 100 మంది మహనీయుల చిత్రపటాలను విద్యార్థుల చేత పట్టించి వారు చేసిన సేవలను చదివించారు. ఎస్ఎమ్డి.ఫరూక్, కేశవ నాథ్, సుధాకర్, జాన్సన్, సుభాషిణి, రాజ్యలక్ష్మి, నయోమి, నాగార్జున, గోవిందప్ప పాల్గొన్నారు. ఆదోని పట్టణంలోని అమరావతి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్యతిథిగా విశ్రాంత తెలుగు పండితులు సుస్వరం నాగరాజాచార్యులు వచ్చి తెలుగు భాష గొప్పదనాన్ని పిల్లలకు వివరిస్తూ అమూల్యమైన పద్యాలతో పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు నన్నయ్య, శ్రీనాథుడు, శ్రీశ్రీ వేషధారణలో అలరించారు. ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథులను సన్మానించారు. గోనెగండ్లలోని ఎపి మోడల్ పాఠశాలలో భాషా, క్రీడా దినోత్సవం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ షాహినా పర్వీన్ తెలిపారు. ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి, ధ్యాన్చంద్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. 8వ తరగతి విద్యార్థినులకు 2022-24 సంవత్సరానికి ఎన్సిసి ఎంపికను ఎఎన్ఒ సుజాత, హవల్దార్ సురేష్, కోటి ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవనకొండ మండలంలోని తెర్నేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా దినోత్సవం, తెలుగుభాషా దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంతి, ఫిజికల్ డైరెక్టర్లు చందు నాయక్, భాను ఆధ్వర్యంలో నిర్వహించారు. ధ్యాన్చంద్, గిడుగు రామ్మూర్తి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదోని యుటిఎఫ్ కార్యాలయంలో గిడుగు రామ్మూర్తి జయంతి నిర్వహించారు. సాహితీ స్రవంతి డివిజన్ అధ్యక్షులు డాక్టర్ సక్కిరి భాస్కర్ అధ్యక్షత వహించారు. సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల బసప్ప, డివిజన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గొంగళ్ళ నల్లారెడ్డి, డాక్టర్ చిన్న వెంకటేశ్వర్లు, కరేపాకుల రఘురాం, సుబ్బన్న, గాదిలింగప్ప, సూర్యనారాయణ పాల్గొన్నారు. ఆస్పరి మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ధ్యాన్ చంద్, గిడుగు రామ్మూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
కవుల చిత్రపటాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు