Aug 30,2022 01:13

ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ డాక్టర్‌ శంకరశర్మ

ప్రజాశక్తి-కర్నూల్‌ స్పోర్ట్స్‌ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ , డాక్టర్‌ శంకర్‌ శర్మ , స్పోర్ట్స్‌ హాస్టల్‌ మేనేజర్‌ చంద్ర శేఖర్‌ , సిఇఒ వెంకట రమణ , చీఫ్‌ కోచ్‌ భూపతి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ధ్యాన్‌ చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులు ఎదగాలి అని ఆకాంక్షించారు. అనంతరం రమణ మాట్లాడుతూ స్టేడియంలో ఇప్పుడు ఉన్న ధ్యాన్‌ చంద్‌ విగ్రహం ఉన్న స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ షాప్‌ అధికారుల ఆదేశాలున్నాయన్నారు. అనంతరం జాతీయ, రాష్ట్రలో పతకాలు సాదించిన క్రీడాకారులను సన్మానించారు.నగదు పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ క్రీడా కోఆర్డినేటర్‌ శివ కిశోర్‌ , పలువురు కోచ్‌లు పాల్గొన్నారు. అంతకు ముందు ధ్యాన్‌ చంద్‌ చిత్రపటానికి పూల మాల వేశారు. రంగుల బెలూన్స్‌ వదిలారు.