
గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్న మత్స్యకార మహిళలు
ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ఎగువపేట గ్రామాభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యాన మంగళవారం గంగమ్మ తల్లి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హుదూద్, సునామీ, తుపాన్లు రాకుండా ఉండాలని, మత్స్యకార కుటుంబాలను గంగమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుతూ మహిళలు పసుపు, కుంకుమ, పాలు, వేపాకులతో కలగలిపిన మిశ్రమాన్ని కళశాలలో వేసి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్తంశెట్టి మహేష్, గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షులు గంటా నూకరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లిపిల్లి నరసింగరావు, కార్యదర్శి వాసుపల్లి కొండబాబు, మాజీ కౌన్సిలర్ ఎం.లక్ష్మణరావు, వైసిపి మూడో వార్డు ఇన్ఛార్జి ఎం.షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.