Jan 29,2023 23:45

లబ్ధిదారులకు గ్యాస్‌ కనెక్షన్లు అందిస్తున్న అప్పలస్వామినాయుడు, రమణ

ప్రజాశక్తి- ఆనందపురం : ప్రధాన మంత్రి ఉజ్వల భారత్‌ గ్యాస్‌ పథకం కింద మంజూరైన గ్యాస్‌ కనెక్షన్లను వేములవలస, లోడగలవానిపాలెం గ్రామపంచాయతీల్లో పంపిణీ చేశారు. వేములవలసలో 21మందికి, లోడగలవానిపాలెంలో 30 మందికి వేములవలస సచివాలయం వద్ద మాజీ సర్పంచ్‌ కోరాడ అప్పలస్వామి నాయుడు, లొడగల రమణ అందజేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు భారతి, తేజ తదితరులు పాల్గొన్నారు.