గుంటూరు : గుంటూరు జిల్లాలోని రేపల్లెలో ఘోరం జరిగింది. ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదసితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. లంకెవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. విద్యుదాఘాతంతో వీరు మరణించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. మఅతులను ఒడిశాకు చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి షార్ట్సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. ఘటనాస్థలి వద్దకు మీడియాను పోలీసులు అనుమతించడం లేదు.