భోజన ప్యాకెట్లు అందజేస్తున్న దాతలు
భోజన ప్యాకెట్లు అందజేస్తున్న దాతలు
గిరిజనులకు భోజనం ప్యాకెట్లు వితరణ
ప్రజాశక్తి-కావలి:సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం కావలి పట్టణం అంబికా మెడికల్ నిర్వాహకులు, సంయుక్త సేవా సంస్థ సభ్యులైన మామిడి నితిన్ కుమార్ - నిఖిల దంపతుల కుమారుడు హన్షిత్ రెండో పుట్టిన రోజుసందర్భంగా బుడంగుంట గిరిజన ప్రాంతంలో 100 మందిపేదలకు భోజనం ప్యాకెట్లు వితరణ చేశారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, దాతలు మామిడి.నితిన్ కుమార్ - నిఖిల దంపతులు, లలిత కుమారి పాల్గొన్నారు.










