Nov 21,2023 19:33

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
  మండలంలోని మడకంవారిగూడెంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మంగళవారం బొరగం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌ ఉచితంగా పంపిణీ చేసినట్లు ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బొరగం దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఫౌండేషన్‌ అధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో విద్యార్థులకు, గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు, వాలీబాల్‌ కిట్లు, క్రికెట్‌ బ్యాట్లు తదితర సామగ్రిని పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధా, ధర్మరాజు, పి.రమేష్‌, మహారాజ్‌ పాల్గొన్నారు.