Nov 01,2023 20:39

సంక్షేమ పథకాలపై వివరిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని మదిరె గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని, సమస్యలు ఏమిటని అడిగి తెలుసుకున్నారు. ఎంపడిఒ గీతావాణి, సర్పంచి నారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్‌ నాగ మల్లయ్య, హౌసింగ్‌ బోర్డు అధికారి తిక్కన్న, ఎంపిటిసి మాదేవి, మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ కామాక్షి తిమ్మప్ప, ఎపిఒ చంద్రశేఖర్‌, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వైసిపి జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ శ్రీలక్ష్మి, వైసిపి సీనియర్‌ నాయకులు రామలింగేశ్వర యాదవ్‌, లక్ష్మీ కాంత్‌ రెడ్డి, సీనప్ప, దేవేంద్ర, హనుమంతు, తిక్కన్న, అంజి, శంకర్‌, గిడ్డయ్య, చిన్న ఈరన్న పాల్గొన్నారు.