Sep 14,2023 22:21

గుంటూరు సిటీ: పోలీసు నియామక పక్రియలో భాగంగా గుంటూరు రేంజ్‌ పరిధి కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు గుంటూరు పెరేడ్‌ గ్రౌండ్స్‌ మైదానంలో 15 రోజు దేహదారుడ్య పరీక్షలు గుంటూరు రేంజ్‌ ఐ.జి పాల్‌ రాజు మంగళగిరి బెటాలియన్‌ కమాండెంట్‌ సుబ్బారెడ్డి అడిషనల్‌ ఎస్పీ సుప్రజా పర్యవేక్షణలో కొనసాగాయి. 705 మంది అభ్యర్దులకు గాను 382 మంది అభ్యర్దులు అర్హత సాధించినట్లు ఐ.జి తెలిపారు.వీరికి సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ తర్వాత బయోమెట్రిక్‌, ఎత్తు, ఛాతి వంటి ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్టుల అనంతరం ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ లతో పాటు 1600,100 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌ పరీక్షలు నిర్వహించారు.