Oct 28,2023 00:38

పాడేరులో ప్రజా రక్షణ భేరి పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అప్పలనర్స, నేతలు

ప్రజాశక్తి-పాడేరు: ఎర్రజెండా గెలుపు తోనే ఆదివాసీ హక్కుల రక్షణ, అభివృధి సాధ్యమని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి అప్పల నర్శ తెలిపారు. సిపిఎం ప్రజా ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టోను జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్‌. సుందర్‌రావు, మండల నాయకులు పి.లక్కుతో కలిసి శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ, జీఓ 3 రిజర్వేషన్‌ రద్దై నేటికీ 3 సంవత్సరాలు అయినప్పటికి, నేటికీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాజ్యాంగ సవరణ చేసి 5వ షెడ్యూల్డ్‌ క్లాజ్‌ 2 ప్రకారం స్థానిక ఆదివాసీలకు నూరు శాతం రిజర్వేషన్‌ కల్పించ వచ్చుని గిరిజన సలహా మండలి (టి.ఏ.సి) తీర్మాణం చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ కనీసం బాధ్యతగా వ్యహరించి, అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపలేదన్నారు. బోయ/ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించడం పై అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన జగన్‌ ప్రభుత్వం ఆదివాసీ రిజర్వేషన్‌ పై మాత్రం చిత్త శుద్ది లేదని విమర్శించారు. స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కనీసం ప్రశ్నించ లేదన్నారు. బస్‌ యాత్ర 1న అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ప్రవేశించి 4 రోజులు పాటు సాగి 9న విజయవాడ చేరుతుందని, నవంబర్‌ 15న విజయ వాడ లో జరిగే బహిరంగ సభ ను విజయ వంతం చేయాలన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు వంత పాడటం మానేసి రాష్ట్రం హక్కుల కోసం బీజేపీని నిలదీయాలనీ, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరగబడతారన్నారు.
అరకులోయ రూరల్‌:బిజెపి పార్టీని గద్దె దించి ప్రజల్ని రక్షించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన చేపడుతున్న ఆ పార్టీ ప్రజా రక్షణ బేరి బస్సు యాత్రను జయప్రదం చేయలని అరకు వేలి ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో బస్సు యాత్ర గోడ పత్రిక విడుదల చేశారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి కె.రామారావు మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను తాకట్టు పెడుతున్న నోరు మెదపని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను తగ్గిన బుద్ధి చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు, జన్ని భగత్‌ రామ్‌, కె.బుజ్జి బాబు, పి.నానిబాబు, కె.రమేష్‌ ఎస్‌.సిబో తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: ప్రజా రక్షణ భేరి పోస్టర్‌ను స్ధానిక గిరిజన సంఘం బవనం వద్ద జడ్పిటిసి దీసరి .గంగరాజు ఆద్వర్యన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జడ్పిటిసి మాట్లాడుతూ, విశాఖ ఉక్కును అమ్మేసి ఉత్తరాంధ్ర ప్రయోజనాలను దెబ్బకొడుతున్న ప్రభుత్వాలను గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోమేల. నాగులు, టోకురు సీపీఎం సర్పంచ్‌ కిల్లో.మోస్య, మండల నాయకులు జ్యేష్ఠ వెంకటరమణ పాల్గొన్నారు
కూనవరం అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం నిర్వహించనున్న ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను మండలంలోని మార్తా శ్రీమ్మూర్తి భవన్‌లో శుక్రవారం ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపీపీ కొమరం పెంటయ్య, సిపిఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశం మొత్తం. అస్త వ్యస్తం తయారైందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, సీనియర్‌ నాయకులు, నాగరాజు, శ్యామల కృష్ణ, ఆవుల మురళి, కర్నాటి శ్రీనివాసరావు, తాళ్లూరి శ్రీనివాసరావు, జ్యోతి, కుంజా రాధ తదితరులు పాల్గొన్నారు.
కొయ్యూరు : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో ఏ ప్రాతిపదికన కలిసి పని చేయడానికి టిడిపి, జనసేన తహతహలాడుతున్నాయో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోనంగి చిన్నయ్యపడాల్‌ డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 15న విజయవాడలో జరుగుతున్న ప్రజా రక్షణ భేరి బహిరంగ సభ గోడపత్రికను కొయ్యూరు మండలం డౌనూరులో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చింతపల్లి మండల కార్యదర్శి పాంగి ధనుంజరు, కొయ్యూరు మండల నాయకులు వై అప్పలనాయుడు, ప్రసాద్‌, సాన పాల్గొన్నారు.