అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇద్దరు సెక్షన్ అధికారులు, సహాయ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్థికశాఖలో సెక్షన్ అధికారులుగా పనిచేస్తున్న డి.శ్రీనుబాబు, కె.వరప్రసాద్, సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికశాఖలోని సమాచారం లీక్ చేస్తున్నారనే అభియోగంపై వారిని సస్పెండ్ చేసింది. వేటు పడిన ముగ్గురూ ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది.