Oct 18,2023 23:40

ధర్నా అనంతరం విద్యుత్‌ ఎఇకి వినతిపత్రం ఇస్తున్న వామపక్ష పార్టీల నాయకులు

ప్రజాశక్తి - మంగళగిరి : పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌) ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరి విద్యుత్‌ ఎడిఇ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నాయకులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను పెంచి వినియోగదారులపై రూ.వేల కోట్ల భారాలు మోపిందని విమర్శించారు. సర్దుబాటు చార్జీలు, ట్రూ ఆఫ్‌ చార్జీలు, ఇతర చార్జీల పేరుతో ఎన్నడు లేని విధంగా చార్జీలు పెంచిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగానే ఈ ఛార్జీలని చెప్పారు. అనంతరం విద్యుత్‌ ఎఇ వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, సీనియర్‌ నాయకులు పి.బాలకృష్ణ, పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, నాయకులు కె.ఏడుకొండలు, జె.శివభవన్నారాయణ, జె.బ్రాహ్మణి, ఎన్‌.వెంకటేశ్వరరావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు ఎన్‌.బ్రహ్మేశ్వరావు, జె.జాన్‌బాబు, జిసామ్‌రెడ్డి, జె.సాంబశివరావు, టి.వెంక టయ్య, డి.ఈశ్వరరావు, ఎ.మరియదాసు, జి.జానీ, బి.శ్రీనివాసరావు, సిపిఐ (ఎంఎల్‌) నాయకులు కె.కోటేశ్వరరావు, ఎ.ఆదినారాయణ పాల్గొన్నారు.