Jan 23,2023 23:10

డ్రోన్‌ ఎగరవేస్తున్న సర్పంచులు, అధికారులు

ప్రజాశక్తి- ఆనందపురం : ఆనందపురం మండలంలోని ఎల్‌వి.పాలెం రెవెన్యూ పరిధిలో సమగ్ర భూ సర్వే డ్రోన్‌ ఫ్లయింగ్‌ పనులు సోమవారం ప్రారంభించారు. ఆనందపురం హైస్కూల్‌ దగ్గర డ్రోన్‌ ఫ్లయింగ్‌ చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ఫ్లయింగ్‌ పనులు పూర్తికాగానే సర్వేయర్లతో ఫీల్డ్‌కి వెళ్లి సర్వే చేస్తారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ, రైతులందరూ సమగ్ర భూసర్వేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చందక లక్ష్మి, లొడగల రమణ, ఎంపిటిసి రౌతు వెంకటరావు, షినగం చిన్న రామారావు, పాండ్రంకి అప్పారావు, వైస్‌ సర్పంచ్‌ కంచుబోయిన శ్రీను, పైడిరాజు, దొంతల వెంకటనారాయణ, శంకరరావు, విఆర్‌ఒ అప్పల రెడ్డి, సెక్రెటరీ శ్రీరామ్‌మూర్తి పాల్గొన్నారు.