మృతిచెందిన ఎలుగుబంటి
ప్రజాశక్తి-కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం-కంబదూరు ప్రధాన రహదారిలో ఆదివారం ఉదయం ఓ ఎలుగుబంటి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఉదయం ఆ రహదారి గుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. అటుగా వెళ్తున్న ఏదైనా వాహనం ఢకొీనడంతో ఎలుగుబండి చనిపోయిందా.. లేక వేటగాళ్లు ఎవరైనా చంపారా.. అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.










