
తూర్పు గోదావరి : సినీనటుడు, 'కిరాతకుడు' హీరో.. మాజీ సర్పంచ్ బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ (64) అనారోగ్యంతో మృతి చెందారు. పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ కిరాతకుడు సినిమాలో హీరోగా నటించారు. ఆయన స్వయంగా నిర్మించిన రూపాయి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి, తదితర సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. గతంలో స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రాజులపాలెం గ్రామ సర్పంచ్గా కూడా సేవలందించారు. బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతిపై పలువురు సినీ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.