Aug 05,2021 17:37

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఎపి సిఎం జగన్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ (గురువారం) మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నేత దేవినేని ఉమా రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని స్వాగతం పలికారు. అనంతరం భారీ కాన్వారుతో దేవినేని ఉమా విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు వద్ద దేవినేని ఉమా కాన్వారును పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు. కాన్వారును అడ్డుకోవడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. హింసించి ఆనందించడం జగన్‌కు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం నీరాజనాలు పలుకుతుంటే తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. జాతీయ రహదారిపై పోలీసులు ఏ విధంగా వాహనాలు ఆపుతారని ప్రశ్నించారు. చట్టాన్ని అధికార పక్షం చుట్టంలా మార్చుకున్నారని విమర్శించారు.