
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : దువ్వాడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను డిఆర్ఎం అనూప్సత్పతి గురవారం తనిఖీ చేశారు. వెయిటింగ్ హాళ్లు, రైల్వే కార్యాలయాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడుతూ, ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు స్టేషన్లో వైడ్ఫుట్ ఓవర్ బ్రిడ్జి వస్తోందని, స్టేషన్లో లిఫ్ట్ ఏర్పాటు చేశామని, ఈ నెలాఖరులోగా ప్రజలకు అందుబాటులో వస్తుందని తెలిపారు. ఆర్పిఎఫ్ నూతన భవనం దాదాపు పూర్తయిందన్నారు. అమృత్ భారత్ విధానంలో దువ్వాడ స్టేషన్ను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆయన వెంట ఎడిఆర్ఎం (ఇన్ఫ్రా) సుధీర్ కుమార్గుప్తా, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ (గతిశక్తి) టిఎం.రావు, సీనియర్ డివిజనల్ ఇంజినీర్ (సౌత్) ఓంప్రకాష్ మీనా, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రీతి రాణా, సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సిహెచ్.కామేశ్వరరావు పాల్గొన్నారు.