
ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్ : గిడుగు రామ మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో అధికారికంగా కార్యక్రమం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రాధికార సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషకు, సంస్కృతి వికాసానికి సేవలందించిన 44 మందిని సత్కరంచారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాకు చెందిన తెలుగు ఉపన్యాసకులు, రచయిత డాక్టర్ దండెబోయిన పార్వతీదేవిని, తెలుగు భాషా వికాసం సంఘం నాయకులు జెఎస్ఆర్కె శర్మను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రాధికార సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ , ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సత్కార కార్యక్రమం నిర్వహించారు. చెందిన చెందిన వారిని సత్కరించడం పట్ల పలువురు తెలుగు భాషాభిమానులు, కవులు రచయితలు హర్షం వ్యక్తం చేశారు.
