గ్రామస్తులతో మాట్లాడుతున్న డిప్యూటీ డిఎంహెచ్ఒ వెంకటరమణ
ప్రజాశక్తి-మక్కువ : మండలంలోని నంద గిరిజన గ్రామాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఒ వెంకటరమణ బుధవారం సందర్శించారు. మంగళవారం మృతి చెందిన ఆశ్రమ పాఠశాల విద్యార్థి మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామంలో జ్వరాల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో శంబర పిహెచ్సి వైద్యాధికారి రఘుకుమార్ తదితరులు పాల్గొన్నారు.










