
జెసికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు
ప్రజాశక్తి - ఆరిలోవ : సింహాచలం దేవస్థానం సర్వే నెంబరు 275 భూముల్లో నివాసం ఉండే నిరుపేదలకు మౌలిక వసతులు కల్పించాలని, తాటాకుల ఇళ్ల స్థానంలో రేకుల షెడ్డులు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యాన టిడిపి నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందనలో జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్కు వినతిపత్రం అందజేశారు. గత డిఆర్సి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయాలని కోరారు. టిడిపి నాయకులు బుడుమూరు గోవిందు, ఒమ్మి అప్పలరాజు, ఒమ్మి పోలారావు, బాదరు బాలరాజు, గాడి సత్యం, దువ్వి తాతారావు తదితరులు పాల్గొన్నారు.