Aug 18,2023 18:59

విరాళం అందజేస్తున్న దాత

విరాళం అందజేస్తున్న దాత
దేవాలయానికి విరాళం
ప్రజాశక్తి-కందుకూరు:శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం పునర్నిర్మాణం కోసం శాసనసభ సభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి అంకమ్మ తల్లి భక్తులు కలిసి ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్‌ 7వ తేదీన అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా పునర్నిర్మాణం కోసం శ్రీరామగిరి శంకర్‌ ప్రసాద్‌ భార్య అపర్ణ , మల్లికార్జున భార్య ఉషారాణి కలసి రూ 50,116 విరాళంగా శాసనసభ సభ్యులు మానుగుంట మహిధర్‌ రెడ్డి సమక్షంలో ఇచ్చారు. పునర్నిర్మాణ కమిటీ సభ్యులు యెనిమిరెడ్డి వెంకటరెడ్డి , యడ్లపల్లి బైరాగి చౌదరి, కొడాలి కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఇప్పటివరకు అందించిన దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు.