
ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ డైట్లో భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు సోమవారం పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా తరగతులకు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటరాక్ట్ ప్యానెల్స్ సరఫరా చేస్తారని, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అందించనున్నట్లు వివరించారు. డైట్ అధ్యాపకులు గొట్టేటి రవి, షేక్ అల్లా ఉద్దీన్ మాట్లాడుతూ, శక్తి వంత మైన బోధన అభ్యసన వనరుగా ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్పై అవగాహన కల్పించారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్యానెల్ బోర్డుతో స్క్రీన్ కాస్ట్ చేస్తూ కంటెంట్ లేక పాఠ్యాంశాలు చూపించ వచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారి బి.శ్రీనివాసరావు, డైట్ ప్రిన్సిపల్ యు.మాణిక్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.