Aug 06,2021 19:44

హైదరాబాద్‌ : పెన్నా కేసు నుంచి తన పేరును తొలగించాలన్న జగన్‌ పిటిషన్‌పై సిబిఐ, ఇడి కోర్టులో శుక్రవారం జరిగిన విచారణను వాయిదా వేసింది. జగన్‌ డిశ్చార్జ్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సిబిఐ గడువు కోరింది. ఇండియా సిమెంట్స్‌ కేసులోనూ డిశ్చార్జ్‌ పిటిషన్‌ వేస్తామన్న జగన్‌, విజయసాయిరెడ్డి, శామ్యూల్‌ కోర్టుకు తెలిపారు. పెన్నా కేసులో సబిత డిశ్చార్జ్‌ పిటిషన్‌పైనా కౌంటర్‌ దాఖలుకు సిబిఐ గడువు కోరింది. పెన్నా, రఘురాం, ఇండియా సిమెంట్స్‌ ఛార్జ్‌షీట్లపై విచారణను ఈనెల 13కు వాయిదా వేయగా.. ఇడి కేసుల విచారణ అంశంపై హైకోర్టు తీర్పు రావాల్సి ఉందన్న విజయసాయిరెడ్డి అభ్యర్థనతో ఇడి కేసుల విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.