Nov 20,2023 00:17

మాట్లాడుతున్న ఎస్సై ఉపేంద్ర

ప్రజాశక్తి-గొలుగొండ: చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేడిపేట ఎస్సై ఉపేంద్ర కోరారు. మండలంలోని ఏఎల్‌ పురం గ్రామంలో ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, గ్రామాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. బ్యాంకు నుంచి విత్‌ డ్రా చేసిన అమౌంట్‌ ఇంటికి తెచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా డబ్బును దొంగిలించే అవకాశం ఉందన్నారు. ఏటీఎం పిన్‌ ఎవరికి చెప్పకూడదన్నారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.