Nov 03,2023 21:13

ఇంటింటి ప్రచారం చేస్తున్న బీవీ

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయనాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని 5వ వార్డులో 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ' నిర్వహించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరే విధంగా చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. అధికార వైసిపి వైఫల్యాలను, కక్ష సాధింపు చర్యల గురించి ప్రజలకు వివరించారు.