Sep 13,2023 21:03

నిరసన దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, నాయకులు

రాయచోటి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టిడిపి కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి రిమాండ్‌కు పంపడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా అనేకమంది శిక్షణ పొంది ఉపాధి పొందారున్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజులు ఖాదర్‌ బాషా, రాజంపేట పార్లమెంటరీ టిడిపి అధికార ప్రతినిధి వతన్‌ నిస్సార్‌, టిడిపి పట్టణ, రూరల్‌ అధ్యక్షులు ఎస్‌.ఖాదరవల్లి, మురికినాటి వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : టిడిపిఅధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో బుధవారం శ్రీ చైతన్య పాఠశాల పక్కన టిడిపి శ్రేణులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్బంగా బత్యాల మాట్లాడుతూ మచ్చ లేని తమ నాయకుడు చంద్రబాబు పై అక్రమ కేసు బనాయించి రిమాండు కు పంపడం దుర్మార్గమైన చర్యన్నారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా అనేకమంది యువత శిక్షణ పొంది ఉపాధి పొందారని, నిరాధార ఆరోపణలు నుండి బాబు త్వరలోనే మచ్చలేని నాయకుడిగా తిరిగి బయటకొస్తారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి అద్దేపల్లి ప్రతాప్‌ రాజు, మండల రూరల్‌ అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్య నాయుడు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, మహిళా నాయకురాలు అనసూయమ్మ, పత్తిపాటి కుసుమకుమారి, జ్యోతి శివ పాల్గొన్నారు.