Nov 20,2023 23:20

ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి అధినేత చంద్రబాబుకు బెయిల్‌ మంజూరవడంపై ఆ పార్టీ ఆధ్వర్యాన సంబరాలు నిర్వహించారు. కాకినాడ మాజీ మేయర్‌ సుంకర పావని ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తుమ్మల రమేష్‌, రహీమ్‌, ఒమ్మి బాలాజీ, ఖాన్‌, అన్సర్‌, గుజ్జు బాబు, రహీమ్‌, మెంటారావు, బంగారు సత్యనారాయణ, వీరంరెడ్డి శ్రీనివాస్‌, బొచ్చా దాసు, కన్నీడి వరప్రసాద్‌, మల్లాడి గంగాధర్‌ పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచారు. కటకంశెట్టి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రపాలెంలో మాజీ జెడ్‌పిటిసి నులుకుర్తి వెంకటేశ్వరరావు స్వీట్లు పంచారు. కొండా వినాయక్‌, దమ్ము నూకరాజు, వాసంశెట్టి నిరీక్షణ్‌, కోణాల కృష్ణ, పితాని శ్రీను, గుబ్బల శివ పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ హెడ్‌పోస్టాఫీసు వద్ద సంబరాలు నిర్వహించారు. బడుగు శ్రీకాంత్‌, టిడిపి కౌన్సిలర్‌ బలుసు వాసు పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ మెయిన్‌ సెంటర్‌లో బాణసంచా కాల్చారు. మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ, ఎస్‌విఎస్‌.అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జీను మణిబాబు పాల్గొన్నారు. తాళ్లరేవు పి.మల్లవరంలో ధూళిపూడి వెంకటరమణ, ఉంగరాల వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.