
ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని తడిగిరి గ్రామ పంచాయతీలో లయ సంస్థ సహకారంతో మిరియాలు, సామలు, కొర్రలు, రాగులు, పసుపు శుద్ది యంత్రాలను ఎస్వీడీఎస్ చీఫ్ సెక్రటరీ జోగి నాయుడు, సర్పంచులు పెనుమాల రంజిత్ కుమార్, సోమెలి సత్యవతి కలిసి బుధవారం ప్రారంభించారు. మండలంలోని తడిగిరి గ్రామ పంచాయతీలో చిరుధాన్యాలు శుద్ధి యంత్రాలను ఉచితంగా అందించారు. అనంతరం ఆ సంస్థ చీఫ్ సెక్రటరీ జోగినాయుడు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు పండించిన పంటలకు శుద్ది యంత్రాలను అందజేయడం జరిగిందన్నారు. శుద్ధి చేయక పోవడంతో పంటలకు సరైన ధర లేదని ఆయన పేర్కొన్నారు. శుద్ధి చేసిన పంటలకు మంచి ధర ఉంటుందని తెలిపారు.అల్లూరి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం, అంబేద్కర్ రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘాలు, లయ సంస్థ ఆర్థిక సహాయంతో యంత్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యులు ఎం.విశ్వేశ్వరరావు, టిడిపి సీనియర్ నాయకులు సోమేలి లక్ష్మయ్య, ఎస్పిడిఎస్ సూపర్వైజర్ నాగమణి, మధులత పాల్గొన్నారు.