చింతలపల్లి : పశ్చిమ గోదావరి జిల్లా రాజోలు మండలం చింతలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఫిర్యాదు చేశాడనే కోపంతో ఒక వ్యక్తిని యువకుడు కర్రతో కొట్టి చంపాడు. వివరాల్లోకి వెళ్తే..... భాస్కర్ అనే యువకుడు తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తండ్రి మార్లపూడి సురేష్ తెలుసుకున్నాడు. ఈ విషయంపై భాస్కర్ తల్లిదండ్రులకు ఫిర్యాదు అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేశాడు. తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడనే కోపంతో సురేష్పై ఆ యువకుడు కర్రతో దాడి చేశాడు. దీంతో సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.