Feb 10,2023 23:56

చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సత్యనారాయణ

ప్రజాశక్తి -ఆనందపురం : మండలంలోని వేములవలస పంచాయతీలో చెత్త నుంచి సంపద తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈవో డి.సత్యనారాయణ మాట్లాడుతూ, తడి, పొడి చెత్తను వేరుచేసి తడి చెత్త ద్వారా వానపాముల ఎరువులుగా తయారు చేయాలన్నారు. పొడి చెత్తలో ప్లాస్టిక్‌ వ్యర్ధాలను వేరు చేయాలని సూచించారు. వీటిపై అవగాహన పెంచుకొని చెత్త నుంచి సంపద కేంద్రాలను వృద్ధిలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ లవరాజు, జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం అధికారి ఎన్‌వివిఎన్‌.మూర్తి, రీసెర్చ్‌ పర్సన్‌ నళిని, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.