Aug 05,2021 13:05

దంతెవాడ : ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ సమీపంలోని ఘాటియా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులు పేలి 12 మంది గాయపడ్డారు. అందులో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో జరిగింది. పేలుడు ధాటికి అదే మార్గంలో వెళ్తున్న బోలేరో వాహనం ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రయాణికులు గాయపడగా.. ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయని ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు. గాయపడిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారని.. వారందరినీ చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుగుబాటుదారులు భద్రతా దళాలను లక్ష్యం చేసుకుని బాంబులు అమర్చగా.. అవి పొరపాటున పౌర వాహనంపై దాడి చేయడంతో.. ఈ ఘటన సంభవించిందని ఆయన మీడియాకు తెలిపారు.