Aug 02,2021 16:34

అగర్తలా : తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి , మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఆయన త్రిపురలో పర్యటిస్తుండగా ఈ  దాడి జరిగినట్లు సమాచారం. ఈ మేరకు టిఎంసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. బిజెపి నేతలే అభిషేక్‌పై దాడికి దిగారని వ్యాఖ్యానించింది. బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం ఎలా వుందో చూడండి అంటూ అభిషేక్‌ ట్వీట్‌ చేశారు. సిఎం విప్లవ్‌ దేవ్‌ గారూ.... రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కొత్త శిఖరాల వైపు తీసుకెళ్తున్నారంటూ ఎద్దేవా చేశారు.