తహశీల్దార్ కార్యాలయంలో పరిశీలిస్తున్న జెసి
ప్రజాశక్తి -రాపూరు :కంబాలపల్లిలో జరుగుతున్న భూముల రీ సర్వే పనులను జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్ పరిశీలించారు. అనంతరం రాపూరు తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ప్రతిరోజు నిర్ధేశించి లక్ష్యం మేరకు రీ సర్వే పనులు చేయాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్ మీడియాతో మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేస్తామన్నారు. ఏ విధమైన లాప్సిస్ కనిపించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రీ సర్వే పనుల్లో నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రీ సర్వే వల్ల రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉంటారన్నారు. ట










