ప్రజాశక్తి - కౌతాళం
కౌతాళం మండలంలో వెలసిన శ్రీజగద్గురు ఖాదర్ లింగ స్వామి, శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. అమావాస్య కావడంతో ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఉరుకుందలో దేవాలయ సహాయ కమిషనర్ వాణి ఆధ్వర్యంలో దేవాలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా పర్యవేక్షించారు. దర్గాలో పీఠాధిపతి మున్నా పాష సాహెబ్ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక ఫాతేహాలు నిర్వహించి దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దర్గాలో ఏర్పాట్లను చేశారు. భక్తుల కోసం ఆదోని, బళ్లారి, రాయచూర్, సిరుగుప్ప, ఎమ్మిగనూర్ తదితర డిపోల నుంచి బస్సులను నడిపించారు. ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.
శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో....