పూజలు నిర్వహిస్తున్న పూజారులు
ప్రజాశక్తి - హోళగుంద
శ్రావణమాసం ఆఖరి అమావాస్య సందర్భంగా నెరణికి, నెరణికి తండా, కొత్తపేట కొండ గుహలో వెలసిన దేవరగట్టు శ్రీమాల మల్లేశ్వర దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం ఉదయం నుంచి గిరిపై ఉన్న స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. నైవేధ్యం సమర్పించారు. అక్టోబర్లో దసరా బన్నీ ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ జిల్లా ప్రజలే కాకుండా అనంతపురం, వైఎస్ఆర్ కడప, తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్, కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ అబ్దుల్ జహీర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.