
కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు
ప్రజాశక్తి -ఆనందపురం: ఆనందపురం మండలం బోయపాలెంలో మాజీ సర్పంచ్ వానపల్లి ముత్యాలరావు ఆధ్వర్యాన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో దల్లి రాంబాబు, డెక్కన అప్పల గురువులు, బొట్ట నరసింహారావు, తెడ్లాపు పెద్ద ఎర్రయ్య, ఉజ్జూరు మహేశ్వరరావు, బొట్ట శ్రీను, తెడ్లాప్ గౌరి తదితరులు పాల్గొన్నారు.