Mar 02,2023 23:24

ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్‌ బొడ్డు నరసింహపాత్రుడు తదితరులు

ప్రజాశక్తి -గాజువాక : బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం అని 65వ వార్డు కార్పొరేటర్‌ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. 'బాల్యంలో పెళ్లిళ్లు-భావితరాలకు ఉరితాళ్ళు' అన్న నినాదంతో వార్డులోని గిరిజా కాలనీ సామాజిక భవనంలో దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ ఆధ్వర్యాన అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహపాత్రుడు మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహాలు వల్ల బాలికలకు చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలపై బాలికలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాలికల తల్లితండ్రులు చట్టాలపై అవగాహన కల్పించుకొని బాల్య వివాహలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ కో-ఆర్డినేటర్‌ ఎల్‌.నిఖిల, కమ్యూనిటీ మొబలైజర్‌ వై.ధనలక్ష్మి, వెల్ఫేర్‌ సెక్రటరీ ఆనంద్‌, వార్డు వైసిపి ప్రధాన కార్యదర్శి పెద్దింటి మంగు నాయుడు, సింగంపల్లి దేముడు, పెండ్ర రాజు, వాడపల్లి ప్రవీణ్‌, జాన సతీష్‌, సతీష్‌, వాలంటీర్‌ జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు.