Nov 03,2023 20:47

ఎఇతో మాట్లాడుతున్న మురళీ మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - కోసిగి
ఆయకట్టుదారులు సాగు చేసిన పంటలు చివరి దశలో ఉన్నందున సాగునీటిని పుష్కలంగా అందించాలని మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పి.మురళీ మోహన్‌ రెడ్డి అధికారులను కోరారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పి.మురళీమోహన్‌ రెడ్డి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఎఇ రాజేష్‌ను కలిసి సాగునీటిపై చర్చించారు. మండలంలోని 6, 7, 8, 9ఎల్‌ కాలువలు, నారాయణపురం డిస్ట్రిబ్యూట్‌, ఎంబిఆర్‌, గురురాఘవేంద్ర ప్రాజెక్టు ద్వారా దుద్ది, మూగలదొడ్డి రిజర్వాయర్‌ ద్వారా రైతులకు అందిస్తున్న సాగునీటిని నిలిపేశారని తెలిపారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు సాగునీటిని అదనంగా రెండు రోజులు అందిస్తామని చెప్పారు. అనంతరం మురళీమోహన్‌ రెడ్డి అయకట్టు దారులకు సాగునీరందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎంపిపి ఈరన్న, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు నాడిగేని నరసింహులు, ఎన్‌.నాగరాజు, జంపాపురం బసిరెడ్డి పాల్గొన్నారు.